డ్రగ్స్ స్మగ్లర్ టోనిని హైదరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు విచారణ చేయనున్నారు. పంజాగుట్ట పీఎస్ లో సీపీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మరికొద్ది సేపట్లో పంజాగుట్ట పీఎస్ కు డ్రగ్స్ స్మగ్లర్ టోనిని తీసుకురానన్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న టోనీని టాస్క్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2వరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్లో అతనిని విచారించనున్నారు. టోనీని ఐదురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని వివిధ కోణాల్లో విచారించనున్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. హైదారాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో స్పెషల్ టీమ్ టోనీని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!
మృతుడికి కోవిడ్ సెకండ్ డోస్