
హైదరాబాద్సిటీ, వెలుగు: ఏఐ, ఎడ్యుకేషనల్కమ్యూనికేషన్అండ్ మీడియా ట్రాన్స్ ఫర్మేషన్ అంశాలపై ఇఫ్లూలో నవంబరు 28 నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)డైరెక్టర్ ప్రొఫెసర్టీటీ శ్రీకుమార్ఒక ప్రకటనలో తెలిపారు.
ఈఎంఆర్సీ, సీఈసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్లో ప్రపంచంలోని వివిధ రంగాల నిపుణులు, స్కాలర్స్, విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు.
ఏఐ, విద్యారంగంపై డిజిటల్టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ప్రభావం, ఇన్నోవేషన్స్పై చర్చల్లో పాల్గొనే వారు తమ వివరాలను ఈ నెల 25 లోపు అందజేయాలన్నారు. అలాగే నవంబరు 5 వరకు నోటిఫికేషన్ను అంగీకరిస్తున్నట్టు, నవంబరు 15 నాటికి పేపర్ సబ్మిట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు at director.emmrc@efluniversity.ac.in. సంప్రదించాలని కోరారు.