సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • సింగరేణి గనుల పని స్థలాల్లో చేరిన వరదనీరు
  • రోజుకు సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

పెద్దపల్లి జిల్లా: గత మూడు రోజులుగా ఏకథాటిగా కురుస్తున్న వర్షాలతో రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గ ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. గనుల పని స్థలాలలో వరద నీరు చేరుతోంది. దీంతో రామగుండం రీజియన్ పరిధిలోని 1, 2, 3, 5 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిపేయాల్సి వచ్చింది. రోజుకు సుమారు 40 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని.. వర్షాల కారణంగా ఈ మేరకు బొగ్గ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని సమాచారం.