Sabari Trailer: ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తున్న..వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్ శబరి ట్రైలర్ 

Sabari Trailer: ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తున్న..వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్ శబరి ట్రైలర్ 

డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస సక్సెస్‌‌‌‌‌‌‌‌లు అందుకుంటున్న వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్(Varalaxmi Sarathkumar)..‘శబరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కొండ్ల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో రిలీజ్ కు రెడీ అయింది. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో వచ్చే సీన్స్ ప్రేక్షకులని భయపెడుతున్నాయి. సరికొత్త కథ కథనాలతో సాగే సీన్స్ సస్పెన్స్ ను రేఖిత్తిస్తున్నాయిఅంతేకాకుండా థ్రిల్లర్,యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి..వరలక్ష్మి కెరీర్ లోనే ఫస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.

వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ ఓ రేంజులో ఉంది. ఇక ట్రైలర్ లో 'చనిపోయిన వ్యక్తి బ్రతికి ఎలా వస్తుంది' అనే డైలాగుతో ట్రైలర్ షురూ అవుతూనే ఇంటెన్స్ కలిగించింది. ట్రైలర్ తోనే ఈ రేంజ్ ఎలివేషన్స్ పడిన శబరి..థియేటర్లో ఎటువంటి గూస్బంప్స్ ఫీలింగ్ కలిగిస్తుందో చూడాలి. ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది. 

ఇదిలా ఉంటే, వరలక్ష్మి తెలుగులో నాంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి  మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత క్రాక్ మూవీతో విలన్‌గా వావ్ అనిపించుకుంది. ఇందులో జయమ్మ పాత్రకు ఆడియన్స్ నుంచి  మంచి ప్రశంసలు దక్కాయి. అనంతరం యశోద, వీర సింహారెడ్డి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకుంది. రీసెంట్గా ‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’లో నటించి మెప్పించింది.