ముంబై: ఐపీఎల్ 15వ సీజన్ ముంబైలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో లీగ్ను వివిధ సిటీల్లో కాకుండా మొత్తం ముంబైలోనే ఆర్గనైజ్ చేయాలని గురువారం జరిగిన మీటింగ్లో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సీజన్ను ముంబైలో ఆర్గనైజ్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అని బోర్డు భావిస్తోంది. ముంబై, దాని చుట్టుపక్కల ఉన్న మూడు స్టేడియాల్లో అన్ని మ్యాచ్లను షెడ్యూల్ చేయాలని బోర్డు కన్ఫామ్ చేసినట్టు ది టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. ‘ప్రస్తుతానికి మేం ముంబైని దాటి ఆలోచించడం లేదు. కరోనా థర్డ్వేప్ కూడా కంట్రోల్లోకి వస్తోంది. కాబట్టి టోర్నీని ఫారిన్కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారని పేర్కొంది. ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్తో పాటు నేవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియాలను బోర్డు ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అవసరం అయితే పుణెను కూడా ఓ వేదికగా వాడుకోవాలని చూస్తోంది. ఈ స్టేడియాలకు చేరుకునేందుకు ఫ్లైట్ జర్నీ అవసరం లేదు. అదే టైమ్లో ఈ స్టేడియాలకు దగ్గర్లోనే చాలా 5 స్టార్ హోటల్స్ ఉండటంతో బయో బబుల్ను మెయింటేన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అందుకే బోర్డు పెద్దలు ముంబైనే ప్రిఫర్ చేస్తున్నారు. వచ్చే నెల మెగా ప్లేయర్ ఆక్షన్ జరిగిన వారంలోపు ఐపీఎల్ వేదిక గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.
ఐపీఎల్ 15 సీజన్ మొత్తం ముంబైలోనే!
- ఆట
- January 29, 2022
లేటెస్ట్
- Prathinidhi 2: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
- మా అభ్యర్థి వెలిచాలనే .. అతి త్వరలో హై కమాండ్ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
- 60 రోజుల్లో చార్జిషీట్ .. కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ
- V6 DIGITAL 23.04.2024 EVENING EDITION
- దొంగదెబ్బ తీసే కుట్ర.. అందుకే ఐదు సార్లు కొడంగల్ వచ్చిన : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు