IPL 2024: ఔట్ అయ్యాడని సంబరాలు.. CSK అభిమానిని కొట్టి చంపిన రోహిత్ ఫ్యాన్స్

IPL 2024: ఔట్ అయ్యాడని సంబరాలు.. CSK అభిమానిని కొట్టి చంపిన రోహిత్ ఫ్యాన్స్

ఐపీఎల్ టోర్నీ ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోహిత్ శర్మ ఔట్ అయినందుకు సంబరాలు చేసుకున్నాడని, అతని అభిమానులు ఓ వ్యక్తి తల పగలకొట్టారు. అతను గత రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. చనిపోయిన వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని కావడం గమనార్హం. ఈ ఘటన మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటుచేసుకుంది. 

రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 277 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబై 246 పరుగులకు పరిమితమై 31 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ(26) స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా.. బండోపంత్‌ టిబిలే (63) అనే ఓ చెన్నై అభిమాని.. అతని ఔట్ పై సంబరాలు చేసుకున్నాడు. ఇక ముంబై పని అయిపోయిందంటూ హేళన చేశాడు. అది నచ్చని రోహిత్ అభిమానులు బల్వంత్‌ ఝంజ్‌గే, సాగర్‌ ఝంజ్‌గే.. అతనిపై దాడికి పాల్పడ్డారు. కర్రతో దాడి చేశారు. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బండోపంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. తిబిల్‌ మృతి చెందడంతో అనుమానితులైన సాగర్‌ ఝంజ్‌గే, బల్వంత్‌ ఝంజ్‌గేలను కర్వీర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ నిమిత్తం కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించింది.

ALSO READ | IPL 2024: సోషల్ మీడియాలోనూ CSKదే హవా.. తరువాత స్థానాల్లో RCB, MI