హైదరాబాద్, వెలుగు: నిషేధం తొలగిన తర్వాత ఆడిన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ స్టా ర్ ప్లేయర్ వార్నర్ మరో మెగా ఇన్నింగ్ స్ ఆడేందుకు సిద్ధమవుతున్నా డు. ఆదివారం ఉప్పల్ లో జరిగే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడనుంది. ఈ మ్యాచ్ లోనూ వార్నర్ మరో మెరుపు ఇన్నింగ్ స్ ఆడటం ఖాయమని సన్ రైజర్స్ ఆశతో ఉంది. రాజస్థాన్ ఆటగాడు సంజు శాంసన్ (102 నాటౌట్ ) సూపర్ సెంచరీ చేసినా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో వార్నర్ 37 బాల్స్ లోనే 69 రన్స్ చేయడంతో సన్ రైజర్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో తొలి విజయాన్నం దుకుంది. మరోవైపు రెండు మ్యాచ్ ల ఓటమి అనుభవంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఢీ కొట్టి హోంగ్రౌండ్ లో ఓడిస్తా మని ఆర్సీబీ కాన్ఫిడెం ట్ గా ఉంది.