హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య కేసు.. డీజీపీ శత్రుజీత్ కపూర్ పై వేటు?

హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య కేసు.. డీజీపీ శత్రుజీత్ కపూర్ పై వేటు?

ఐపీఎస్​ అధికారి పురాన్​  కుమార్​ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది.హర్యానా డీజీపీ శ్రతుజీత కపూర్​ ను సెలవుపై పంపారు.  కపూర్​ ను తొలగించాలని ఐపీఎస్​ అధికారి భార్య , దళిత సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో  హర్యానా రాష్ట్ర ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్​ అధికారి ఆత్మహత్య ఘటన ప్రభుత్వ వార్షికోత్సవ ర్యాలీ కూడా వాయిదా పడింది. 

ఐపీఎస్​ అధికారి వై. పురాన్​ కుమార్ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పురాన్​కుమార్​ ఆత్మహత్య తర్వాత హర్యానాలో ఉద్రిక్తత నెలకొంది. పురాన్​ కుమార్ ఆత్మహతకు డీజీపీతో సహా  16 మంది ఉన్నతాధికారులు ఐపీఎస్​ అధికారులు  వేధింపులే కారణమని దళిత సంఘాలు, ఐపీఎస్​ భార్య ఆరోపించి డీజీపీ తొలగింపుకు డిమాండ్​ చేశారు. 

డీజీపీని తొలగించే వరకు అంతిమ సంస్కారాలకు అనుమతి ఇవ్వబోమని పురాన్ కుమార్ భార్య, ఐఎఎస్ అధికారి అమ్నీత్ పి కుమార్ నిరాకరించడంతో కపూర్‌పై చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దాదాపు వారం పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం వివాదం సద్దుమణిగేందుకు మంగళవారం ( అక్టోబర్​ 14) డీజీపీని బలవంతపు సెలవులపై పంపినట్లు తెలుస్తోంది. 

ఐపీఎస్​ అధికారి పురాన్​ కుమార్ ఆత్మహత్యతో ఉద్రిక్తత పెరుగుతుండటంతో షైనీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం జరగాల్సిన మెగా వార్షికోత్సవ సమావేశం, జన్ విశ్వాస్​, జన్​ వికాస్​ ర్యాలీ రద్దు చేశారు. ప్రధాని మోదీ ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించాల్సి ఉంది.