వార్.. సైబర్ వార్.. ప్రభుత్వ వెబ్ సైట్లు, మిలిటరీ, క్రిటికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్లే లక్ష్యం..

వార్.. సైబర్ వార్.. ప్రభుత్వ వెబ్ సైట్లు, మిలిటరీ, క్రిటికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్లే లక్ష్యం..

న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు భీకరంగా తలపడుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా ఇప్పుడు సైబర్ వార్​లోకి దిగాయి. ఇజ్రాయెల్ – అమెరికాకు చెందిన హ్యాకర్లు ఇరాన్  ప్రభుత్వ వెబ్ సైట్లు, మిలిటరీ, క్రిటికల్  ఇన్ ఫ్రాస్ట్రకర్లే లక్ష్యంగా సైబర్  దాడులకు దిగుతున్నారు. ఇరాన్  కూడా తమ శత్రు దేశ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను టార్గెట్​గా చేసుకుని సైబర్  దాడికి దిగింది. 

తాజాగా ఇరాన్​కు చెందిన బడేసాబా క్యాలెండర్ యాప్​ను ఇజ్రాయెల్  హ్యాకర్లు హ్యాక్  చేసినట్లు తెలుస్తోంది. ‘హెల్ప్  ఈజ్  ఆన్  ద వే, మమ్మల్ని నమ్మండి’ అంటూ యూజర్లకు నోటిఫికేషన్లు వెళ్లాయి. ఈ యాప్  హ్యాక్  అయిందని, దానికి సంబంధించిన స్ర్కీన్ షాట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్  అయ్యాయి.