ఇజ్రాయెల్పై ఇరాన్ ఎందుకు దాడి చేసింది..ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి

ఇజ్రాయెల్పై ఇరాన్ ఎందుకు దాడి చేసింది..ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి

ఇజ్రాయెల్ భూభాగంపై ఆదివారం (ఏప్రిల్ 14) తెల్లవారు జామున ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ లోని ప్రధాన పట్టణాలు, ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. సిరియాలోని తన కాన్సులేట్ భవనంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై 200 కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్  క్షపణులతో దాడులు చేసింది. ఇరాన్ మిత్రదేశాలుకూడా ఇజ్రాయెల్ పట్టణాలపై దాడులు నిర్వహించాయి. డమాస్కస్ లోని తమ దౌత్య మిషన్ ను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఆత్మ రక్షణ కోసం ఈ దాడులు చేశామని ఇరాన్ తెలిపింది. అయితే వందలాది డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు..ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులను ఖండించారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కూల్చివేసేందుకు యూఎస్ బలగాలు సహాయం చేశాయని బైడెన్ చెప్పారు. ఇరాన్ దాడులపై G7 దేశాల నేతలతో సమావేశం నిర్వహించారు జో బైడెన్. మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న సంక్షోభంపై ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఇజ్రాయెల్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జో బైడెన్ ప్రకటించారు. 

ఇజ్రాయెల్, ఇరాన్ గాజా స్ట్రిప్ లో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఆరు నెలలుగా యుద్ధం చేస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న రెండు మిలిటెంట్ గ్రూపులు హమాస్, ఇస్లామిక్ జిహాద్ .. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోన 1200 మందిని చంపి, 250 మందిని కిడ్నాప్ చేశారు. ఈ విధ్వంసకర సరిహద్దు దాడి తర్వాత యుద్దం చెలరేగింది. గాజాలో ఇజ్రాయెల్ దాడి భారీ ఎత్తున విధ్వంసం సృష్టించింది. స్థానిక ఆరోగ్య అధికారులు రిపోర్టు ప్రకారం.. 33 వేల మంది కి పైగతా ప్రజలు మరణించారు. 

ఈ యుద్దంలో లెబనాన్ లోని ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుపై దాడి చేశారు.ఇరాక్, సిరియా , యెమెన్ లోని ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు సైతం ఇజ్రాయెల్ పై రాకెట్లు, క్షిపణులను ప్రయోగించాయి. ఇలారు రోజుల తరబడి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 

ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ ఇజ్రాయెల్, ఉత్తర వెస్ట్ బ్యాంక్, జోర్డాన్ సరిహద్దుసమీపంలో డెడ్ సీతో సహా అనేక ప్రదేశాల్లో ఇరాన్  డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సిరియన్, లెబనీస్ సరిహద్దులకు సమీపంలో, దక్షిణ పట్టణాలైన నెవాటిమ్, డిమోనా, ఎర్ర సముద్రం రిసార్ట్ అయిన ఐలాట్ లలో స్థానికులను రక్షిత ప్రదేశాలకు తరలించింది. డిమోనా ఇజ్రాయెట్ ప్రధాన అణు కేంద్రానికి నిలయంగా ఉంది.. నెవాటిమ్ లో ప్రధాన వైమానిక స్థావరం ఉంది.

మరోవైపు ఇజ్రాయెల్, యూఎస్ కు ఇరాన్ మిషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ మరొక తప్పు చేస్తే ఇరాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ముఖ్యంగా అమెరికాకు దూరంగా ఉండాలి అని తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది.