
ఎడిన్బర్గ్: ఐర్లాండ్ క్రికెట్ జట్టు.. 2024 ఐసీసీ టీ20 వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యింది. యూరోపియన్ క్వాలిఫయర్స్లో భాగంగా గురువారం ఐర్లాండ్, జర్మనీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. దీంతో ఈ టోర్నీలో రెండో ప్లేస్లో నిలిచిన ఐర్లాండ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు గెలిచిన ఐర్లాండ్ ఒక డ్రాతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగే ఆఖరి మ్యాచ్లో ఇప్పటికే అర్హత సాధించిన స్కాట్లాండ్తో ఐర్లాండ్ తలపడుతుంది. \