మహేశ్ - జక్కన్న సినిమాలో శ్రీదేవి తనయ?

మహేశ్ - జక్కన్న సినిమాలో శ్రీదేవి తనయ?

తెలుగు తెరపై శ్రీదేవి, సూపర్​ స్టార్​ కృష్ణ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్​ బేస్​ ఉండేది. మళ్లీ అదే తెరపై వారి నటవారసులు జోడీ కడితే ఎలా ఉంటుంది? సోషల్​ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. రాజమౌళి, మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు స్టోరీ లైన్ కూడా కన్ఫర్మ్​ కాలేదు కానీ హీరోయిన్​ ఎవరనే విషయం హాట్ టాపిక్​గా మారింది. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్​ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజగా జాన్వీ కపూర్​ పేరు తెరపైకి వచ్చింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్​ 30లో నటిస్తోంది. ఆ తర్వాత రాంచరణ్​ తోనూ ఆడిపాడనుంది.