ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్బాల్ టోర్నీ నవంబర్ 20న కేరళ బ్లాస్టర్స్-ఎటికె మోహన్బగాన్ జట్ల మధ్య పోరుతో ఆరంభం కానున్నది. దీనికి సంబంధించి నిర్వాహకులు టోర్నీ షెడ్యూల్ను విడుదల చేశారు. గోవాలోని మూడు స్టేడియాల్లో ఈ మ్యాచ్లను నిర్వహించనున్నారు. అయితే ఈ మ్యాచ్ లకు ప్రేక్షకులకు పర్మిషన్ లేదు. ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లను నిర్వహిస్తారు. ఆదివారం జరిగే రెండు మ్యాచ్లను సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తారు.
ఈ ఏడాది కోల్కతాకు చెందిన జట్లు మోహన్బగాన్, ఈస్ట్బెంగాల్ కూడా లీగ్లో పాల్గొననున్నాయి. లీగ్ పోటీలు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జరుగనున్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీల తేదీలను తర్వాత ప్రకటించనున్నారు నిర్వాహకులు.