- 8 మంది పాలస్తీనియన్లు మృతి
జెనిన్: మిలిటెంట్ల పట్టున్న వెస్ట్బ్యాంక్లోని జెనిన్ సిటీపై ఇజ్రాయెల్ సోమవారం భారీస్థాయిలో డ్రోన్లతో దాడి చేసింది. రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన భారీ యుద్ధాన్ని తలపించేలా మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. ఇజ్రాయెల్జరిపిన దాడిలో ఎనిమిది మంది పాలస్తీనియన్లు మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు తెలిపారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారన్నారు.
సోమవారం మధ్యాహ్నం నాటికి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్లోనే ఇంకా సైనిక బలగాలు ఉన్నాయన్నారు. ఆ ఏరియాలో భారీ ఆపరేషన్ నిర్వహించేందుకు ఇజ్రాయెల్ సైనిక బలగాలు ముందుకు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.