జెనిన్ సిటీపై ఇజ్రాయెల్ అటాక్

జెనిన్ సిటీపై ఇజ్రాయెల్ అటాక్
  • 8 మంది పాలస్తీనియన్లు మృతి

జెనిన్: మిలిటెంట్ల పట్టున్న వెస్ట్​బ్యాంక్​లోని జెనిన్ సిటీపై ఇజ్రాయెల్ సోమవారం భారీస్థాయిలో డ్రోన్లతో దాడి చేసింది. రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన భారీ యుద్ధాన్ని తలపించేలా మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. ఇజ్రాయెల్​జరిపిన దాడిలో ఎనిమిది మంది పాలస్తీనియన్లు మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు తెలిపారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారన్నారు. 

సోమవారం మధ్యాహ్నం నాటికి జెనిన్​ రెఫ్యూజీ క్యాంప్​లోనే  ఇంకా సైనిక బలగాలు ఉన్నాయన్నారు. ఆ ఏరియాలో భారీ ఆపరేషన్​ నిర్వహించేందుకు ఇజ్రాయెల్​ సైనిక బలగాలు ముందుకు కొనసాగుతున్నాయని  అధికారులు వెల్లడించారు.