ఇజ్రాయెల్ Vs హమాస్ : 11వందలకు చేరిన మృతుల సంఖ్య

ఇజ్రాయెల్ Vs హమాస్ : 11వందలకు చేరిన మృతుల సంఖ్య

ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించింది. హమాస్ ఆకస్మిక దాడికి ప్రతీకారంగా ముఖ్యమైన సైనిక చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సైన్యం దాని బాంబు దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో రెండు ప్రాంతాల్లోనూ 11వందల మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు.

ALSO READ : ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధం ఎఫెక్ట్ : తగ్గిపోతున్న బంగారం ధరలు.. షాపుల్లో పెరుగుతున్న రద్దీ

హమాస్ చొరబాటుపై ప్రతిఘటించిన ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికీ అనేక ప్రదేశాలలో ఉన్న మిలిటెంట్లతో పోరాడుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో కనీసం 7వందలు, గాజాలో 400 మందికి పైగా మరణించినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. హమాస్ యోధుల నుంచి నాలుగు ఇజ్రాయెల్ సైట్‌లను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బలగాలను తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇందులో మిలిటెంట్లు తమ దాడుల్లో ముందుగా ప్రవేశించిన రెండు కిబ్బట్జిమ్‌లు కూడా ఉన్నాయి.