కశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

కశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

కశ్మీర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. కశ్మీరీల పోరాటాన్ని పవిత్ర యుద్ధంగా చెప్పారు. కశ్మీరీలకు మద్దతుగా పాకిస్థాన్ జిహాద్ చేస్తుందన్నారు. ప్రపంచం ఔనన్నా కాదన్నా .. కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ అండగా ఉంటుందని కామెంట్ చేశారు.

అమెరికా నుంచి ఇస్లామాబాద్ తిరిగొచ్చిన ఇమ్రాన్ ఖాన్ కు.. ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. తనకు మద్దతుగా వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కశ్మీర్ గురించి జిహాద్ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్.