ఉద్యోగాలపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: వివేక్ వెంకటస్వామి

ఉద్యోగాలపై  కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేస్తున్న  ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ముఖ్యమంత్రి తగ్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.  ఎప్పుడూ ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం కేసీఆర్..బండి సంజయ్ దెబ్బకే బయటికి వచ్చి ఇప్పుడు ప్రజల మధ్యలో  తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు  సాగునీరు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. 

అవినీతి లో నెంబర్ 1 కల్వకుంట్ల కమీషన్ రావు అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వివేక్ వెంకటస్వామి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని తెలిపారు. ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.  కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతామని..ముఖ్యమంత్రి పీఠంపై నుంచి కేసీఆర్ ను గద్దె దింపుతామని స్పష్టం చేశారు.