రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

రాష్ట్ర వ్యాప్తంగా మరో సారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు  40 చోట్ల ఒకేసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాలవికాస ఫౌండేషన్, క్రిస్టియన్ సొసైటీ సంస్థల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.  మెదక్, వరంగల్ లోని పలు ప్రాంతాలతో పాటు  హైదరాబాద్ లోని అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, పటాన్ చెరు, తార్నాక, కూకట్ పల్లి సహా మరో 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

మొత్తం ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయిన సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ సంస్థల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన పక్కా ఆధారాలతోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం.