విప్రో లాభం రూ. 2,870 కోట్లు

విప్రో లాభం రూ. 2,870 కోట్లు

విప్రో లాభం రూ. 2,870 కోట్లు

క్యూ 1 రెవెన్యూ రూ. 22,831 కోట్లు

బెంగళూరు : ఐటీ సేవల కంపెనీ విప్రో జూన్​2023 క్వార్టర్లో తన లాభాన్ని 12 శాతం పెంచుకుంది. లాభం అంతకు ముందు ఏడాది క్యూ 1 లోని రూ. 2,563.60 కోట్ల నుంచి తాజా క్యూ 1 లో రూ. 2,870 కోట్లకు చేరింది. మొదటి క్వార్టర్లో రెవెన్యూ కూడా 6 శాతం ఎక్కువై రూ. 22,831 కోట్లయిందని కంపెనీ ప్రకటించింది. మార్కెట్​ అంచనాలను మాత్రం విప్రో చేరుకోలేకపోయింది. క్లయింట్లు పెట్టే ఖర్చు కొంత తగ్గుతోందని, కాకపోతే కొత్త బిజినెస్​ కొంత ఊపందుకుంటోందని రిజల్ట్స్​ ప్రకటన సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఇక సీక్వెన్షియల్​గా చూస్తే మాత్రం కంపెనీ రెవెన్యూ, లాభం తగ్గిపోయాయి. లాభం 6.65 శాతం తగ్గితే, రెవెన్యూ 1.55 శాతం పడిపోయింది.