
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా భారత్ లో పర్యటిస్తున్నారు. అయితే అందరి కళ్లు మాత్రం ట్రంప్ కూతురు, సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ పైనే. అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్ తో, అదిరే అందంతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే మొదటి రోజు ఎర్రటి డ్రెస్ వేసుకుని అందరినీ ఆకట్టుకున్న ఇవాంక. రెండో రోజు రాష్ట్రపతి భవన్ వద్దకు ఆమె వేసుకొచ్చిన డ్రెస్ మాత్రం అందరినీ ఆకర్షించింది. తెల్లటి షేర్వానీ వేసుకున్న ఇవాంక.. అందిరి చూపు తన వైపే తిప్పుకున్నారు. ఫోటోగ్రాఫర్స్ కూడా క్లిక్ మనిపించారు. .ఇవాంక వేసుకున్న షేర్వానీ తెల్లటి రంగులో ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి. స్లివ్లెస్ కాకుండా భారతీయత ఉట్టిపడేట్టు ఇవాంక కనిపించారు.
అయితే ఇవాంక వేసుకున్న తెల్లటి షేర్వానీని 20 ఏళ్ల క్రితమే తాను డిజైన్ చేసినట్లుగా ఇండియాకు చెందిన డిజైనర్ అనితా డోంగ్రే చెప్పారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ముర్షిదాబాద్ పట్టుతో డిజైన్ చేశానని చెప్పారు. ఈ పట్టును చేతితో నేశారని తెలిపారు. కానీ 20 ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి షేర్వానీ ఇప్పటికీ చూడచక్కగా ఉందన్నారు. అయితే తనకు వైట్ ,బ్లూ కలర్ అంటే ఇష్టమన్నారు.
ప్రపంచంలోని శక్తిమంతమైన మహిళలకు అనిత డిజైన్ చేస్తుంటారు.కేట్ మిడిల్టన్కు, బెల్జియానికి చెందిన రాణి మథిదే, ట్రుడేకి చెందిన సోపి గ్రెగోయిర్ డ్రెస్ లను డిజైన్ చేశారు. 2018లో హిల్లరీ క్లింటన్ డ్రెస్సులను కూడా అనిత డిజైన్ చేశారు.