
హైదరాబాద్, వెలుగు: బీసీల రూ.లక్ష ఆర్థికసాయానికి సంబంధించి రాష్ట్ర సర్కారు రూ.400 కోట్ల నిధులు విడుదల చేసింది. బడ్జెట్ కేటా యింపుల నుంచి నిధులను విడుదల చేస్తున్న ట్లు మంగళవారం జీవో జారీ చేసింది. బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద.. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు.
కాగా, బీసీ ఆర్థిక సాయానికి దరఖాస్తు గడువు గత నెల 20తో ముగిసిన సంగతి తెలిసిందే. 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం 14 కులాల వాళ్లకు మాత్రమే స్కీమ్ అమలు కానుంది.