
గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శనివారం సెగ్మెంట్ లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మైహోం మంగళ, నల్లగండ్లలోని లక్ష్మీ విహార్ ఫేజ్–2లో ఇంటింటికి తిరుగుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు.