అంగన్వాడీలకు జగన్ సర్కార్ అల్టిమేటం..

అంగన్వాడీలకు జగన్ సర్కార్ అల్టిమేటం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు అక్కడి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధులకు రాని వారి పై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నెల 5వ తేదీలోపు అంగన్వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. కాగా, తమకు జీతాలు పెంచాలంటూ అంగన్వాడీలు గత 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇప్పటివరకు ప్రభుత్వంతో పలుమార్లు చర్చించిన ఫలించకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహంతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వం  పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం జారీ చేసిన అల్టిమేటానికి అంగన్వాడీలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది  చర్చనీయాంశం అయ్యింది.