
ఏపీ సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై వెళ్తుండగా బ్యానర్ చూసి క్యాన్సర్ తో బాధితుడికి సాయం చేశారు. ఇవాళ(మంగళవారం) విశాఖలో జగన్ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకుని తిరిగి విజయవాడ వెళ్తుండగా దారి మధ్యలో కొందరు టీనేజర్లు బ్యానర్ల పట్టుకుని నిలబడ్డారు. నీరజ్ అనే తన స్నేహితుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని అతడికి సాయం చేయాలని కోరుతూ బ్యానర్లు పట్టుకున్నారు. దీంతో ఆ బ్యానర్లను చూసి ఆగిపోయిన జగన్ తన కాన్వాయ్ ను ఆపి ఆ కుర్రాళ్ల దగ్గరకు వెళ్లారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన స్నేహితుడు హైదరాబాద్ లో ని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సాయం చేయాలని వారు జగన్ ను కోరారు. దీంతో వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్ ను పిలిపించిన జగన్..నీరజ్ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి.. నిధులు విడుదల చేయాలని ఆదేశించారు ..