రేవంత్ రెడ్డిపై సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ

రేవంత్ రెడ్డిపై  సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలగించి.. వేరే వారిని నియమించాలంటూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. లేదంటే పార్టీ మార్గదర్శనంలో నడిచేలా రేవంత్ ను నియంత్రించాలని లేఖలో  స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి పార్టీ వైఖరి కంటే సొంత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. స్టార్ లీడర్ గా ఎదగాలనుకుంటున్న రేవంత్ రెడ్డి తనకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటున్నారని, సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దించలేదని అన్నారు.  తెలంగాణలో పార్టీ నడుస్తున్న తీరు చూస్తుంటే  కాంగ్రెస్ పార్టీలా లేదని.. ఓ కార్పొరేట్ ఆఫీసులా నడుస్తోందని విమర్శించారు. గ్రామస్థాయికి వెళ్లి పనిచేసే ఉద్దేశం రేవంత్ కు లేదని, ఇది పార్టీకి ప్రమాదం అని తెలిపారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్న జగ్గారెడ్డి.. పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నానని  స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణాలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు