టీఆర్ఎస్, బీజేపీలకు మెఘా కృష్ణారెడ్డి ఇన్కం సోర్స్

టీఆర్ఎస్, బీజేపీలకు మెఘా కృష్ణారెడ్డి ఇన్కం సోర్స్

తెలంగాణలో బీజేపీ తీరు నవ్వులాటలా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీజేపీ విచిత్రమైన ఉద్యమాలు చేస్తుందన్నారు. వరి పంచాయతీ తెచ్చింది కేంద్రంలోని బీజేపీ అని అన్నారు. జీవో 317 చిచ్చుకు మూల కారణం కేంద్రమేనన్నారు. రాష్ట్రంలో 2023 ఫిబ్రవరిలో   కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ను ఆర్థిక పరమైన దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ కుట్రలపై లేఖ రాస్తానన్నారు. మెగా కృష్ణారెడ్డి 2004 లో చిన్న మారుతీ కారులో సెల్ఫ్ డ్రైవింగ్ తో వెళ్ళేవాడు.. కానీ ఈ రోజు లక్షల కోట్లకు చేరిండన్నారు. మెగా కృష్ణారెడ్డి ఎపిసోడ్ లను ఆధారాలతో ముందు పెడ్తానన్నారు. ఒకవైపు టీఆర్ఎస్.. మరోవైపు బీజేపీలకు మెగా కృష్ణారెడ్డి ఇన్ కం సోర్స్ గా మారారన్నారు జగ్గారెడ్డి.