టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేకు లేఖ రాశారు. తాను మెదక్ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని 47 నియోజకవర్గాల్లో తాను పాదయాత్ర చేస్తానని..ఇందుకు పర్మిషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడిమెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలు, హైదరాబాద్ జిల్లాలోని 15, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 15 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని తెలిపారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేయని నియోజకవర్గాల్లో తాను పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తనకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు జగ్గారెడ్డి. ఠాక్రే తప్పకుండా పర్మిషన్ ఇస్తారని భావిస్తున్నానన్నారు. పార్టీ బలోపేతం కోసమే పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఒక వేళ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తాననేది చెబుతానన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాత్ సే హాత్ జోడోయాత్ర చేస్తున్నారు. పలువురు కాంగ్రస్ నేతలు తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు.