వరదల్లో కొట్టుకుపోయిన రిపోర్టర్ జమీర్ మృతి

వరదల్లో కొట్టుకుపోయిన రిపోర్టర్ జమీర్ మృతి

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేట వాగులో కారుతో గల్లంతైన రిపోర్టర్ జమీర్ చనిపోయారు. రామోజీపేట భూపతిపూర్ మధ్యలో కొద్దిసేపటి క్రితమే జమీర్ కారును గుర్తించి బయటకు తీశారు. అయితే అక్కడి నుంచి కొద్ది దూరంలో చెట్ల కొమ్మలో చిక్కుకున్న జమీర్ డెడ్ బాడీని రెస్క్యూ టీం గుర్తించింది. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం రామెజీపేట- భూపతిపూర్‌ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది. మూడురోజుల క్రింతం షిప్ట్‌ డిజైర్‌ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్‌ కవరేజ్‌కు వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్‌ జమీర్‌ వున్నారు. ఈన్యూస్‌ కవరేజ్‌ చేసేందుకు వెళ్ళిన జమీర్‌, కుటుంబ సభ్యుల నుంచి ఓ వార్త రావడంతో.. వెనుతిరిగాడు జమీర్‌. అయితే ఈ క్రమంలో.. రామోజీపేట వాగు మీదుగా కారులో వస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువైంది.

వరద ధాటికి జమీర్‌ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. దీంతో.. మంగళవారం రాత్రి నుండి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించినా కారు ఆచూకి లభ్యం కాలేదు. అయితే ఎట్టకేలకు జమీర్‌ ఆచూకి లభ్యమైంది. శుక్రవారం ఉదయం కారుతో సహా జమీర్‌ను బయటకు తీశారు. చెట్టు కొమ్మకు జమీర్‌ మృతదేహం కనిపించడంతో.. ప్రాణాలు తెగించి రెస్క్యూటీం జమీర్‌ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. జమీర్‌ మృతితో కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. జమీర్ మరణం పట్ల పలువురు పాత్రికేయులు సంతాపం తెలిపారు.