బోస్టన్లో 'జై భీమ్‌' కు అవార్డుల పంట

బోస్టన్లో 'జై భీమ్‌' కు అవార్డుల పంట

సూర్య హీరోగా తెరకెక్కిన 'జై భీమ్‌' సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలిజై మంచి టాక్ సంపాదించుకుంది.  జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల 'దాదా సాహేబ్‌ పాల్కే ఫిలీం ఫెస్టివల్‌'లో రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 'ఉత్తమ చిత్రం'గా నిలవగా, మూవీలో నటించిన మణికందన్‌కు 'బెస్ట్‌ సపోర్టింగ్ యాక్టర్‌' అవార్డు వచ్చంది. తాజాగా 'జై భీమ్‌' సినిమా మరో రెండు అవార్డులను సాధించింది. ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో జై భీమ్‌ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటి లియోమోల్‌ జోస్‌కు 'ఇండీ స్పిరిట్ బెస్ట్‌ యాక్ట్రెస్' అవార్డు వరించగా, 'ఇండీ స్పిరిట్ బెస్ట్‌ సినిమాటోగ్రఫీ' అవార్డును మూవీ కెమెరామెన్‌ ఎస్‌.ఆర్‌. కదీర్‌ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌' పేర్కొంది. 

మరిన్ని వార్తల కోసం...

లైగర్ హంట్​ బిగిన్స్

సందీప్ కిషన్ బర్త్ డే గిఫ్ట్స్ వచ్చేశాయ్..!