ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ రెడ్డి ఒకరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ రెడ్డి ఒకరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 దేశంలో ఐదు మంది ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ ఒకరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి దూరం అయ్యి చాలా రోజులైందని అయినా ఆయనను రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తు చేసుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వతగా ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని పొంగులేటి చెప్పారు. 

నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ వద్ద మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, జైపాల్ రెడ్డి ఆశయాల  కోసం కాంగ్రెస్ ప్రభుత్వం  ముందుకు వెళ్తుందని పొంగులేటి చెప్పారు. ప్రభుత్వ పాలనకు ఈ 40 రోజుల పాలనే నిదర్శనమని అన్నారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ జైపాల్ రెడ్డిని  దేశంలో ఉండే ప్రతి ప్రజాస్వామిక వాది ఆదర్శనంగా తీసుకోవాలని అన్నారు. ప్రజాస్వమ్యానికి ప్రమాదం వచ్చినపుడు అతి కిలంగా పని చేశారని చెప్పారు. ప్రతి ఉద్యమన్ని నీరుగర్చకుండా చివరి వరకు  పోరాటం చేయాలని చెప్పేవారని తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తేవారని మంద కృష్ణ మాదిగ చెప్పారు.