
పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత భారత్... పాకిస్తాన్ మధ్య ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. మిస్సైల్స్ అటాక్.. ఎయిర్ఫోర్స్. నేవీ. ఆర్మీ బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్ ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసిన తరువాత పరిస్థితి మరీ తీవ్రరూపం దాల్చింది. పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తుండగా.. భారత్ వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ ఇండియా పై చేయి సాధిస్తుంది.
డైరక్ట్గా తలపడలేని పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాదులతో అలజడి సృష్టించేందుకు టెర్రరిస్ట్ సంస్థ జైషే మహమ్మద్ అనుచరులు భారత్లోకి ప్రవేశించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. జమ్మూకాశ్మీర్లోని సాంబా సెక్టార్లోని భారత్.. పాకిస్తాన్ సరిహద్దులో భారత్లోకి ఏడుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. ఎల్ఓసీ నుంచి భారత్ లోకి చొరపడేందుకు ప్రయత్నించిన జూషే మహమ్మద్ ఉగ్రవాదులను భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించి.. వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. వారు కాల్పులకు సిద్దపడుతుండగా.. ఈ లోపే బీఎస్ఎఫ్ బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరపగా వారు మరణించారు.