
ఖైరతాబాద్, వెలుగు:సమగ్ర కుటుంబ సర్వేలో ఉద్యోగులతోపాటు రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేపై బీఆర్ఎస్, బీజేపీ రెండు రోజుల్లో తమ వైఖరిని ప్రక టించాలన్నారు. లేదంటే తెలంగాణలో ఆ పార్టీలకు ఇక మనుగడ ఉండదని చెప్పారు.
అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర
‘ఓబీసీ మేలుకో’ అంటూ 33 జిల్లాల్లోని 119 నియోజకవర్గాల్లో నవంబరు 6 నుంచి 15 రోజులపాటు సామాజిక కులగణన యాత్ర నిర్వహిస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపా రు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర జరుగుతుందన్నారు.
136 బీసీ కుల సంఘాల ప్రతినిధులతో 3వ తేదీన హైదరాబాద్లో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బీసీ కులగణన ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధిగా తీగల ప్రదీప్ గౌడ్కు నియామక పత్రం అందజేశారు.