టీఆర్ఎస్ టికెట్ కోసం జమ్మికుంట,ఇల్లందుకుంట రెడ్డి కులస్థుల డిమాండ్

టీఆర్ఎస్ టికెట్ కోసం జమ్మికుంట,ఇల్లందుకుంట రెడ్డి కులస్థుల డిమాండ్

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం జమ్మికుంట, ఇల్లందకుంట మండలంలోని రెడ్డి కులస్థులు డిమాండ్ చేశారు. జమ్మికుంటలోని, వినాయక గార్డెన్ లో జరిగిన రెడ్డి కులస్తులు ఆత్మీయ సమ్మేళనంలో టీఆరెస్ రాష్ట్ర నాయకుడు తుమ్మేటి సమ్మి రెడ్డి మాట్లాడుతూ.. జమ్మికుంట ఇల్లందకుంట మండలాల నుండి రెడ్డి  కులస్తులకు టిఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యం  కల్పించాలన్నారు. ఇప్పటివరకు జమ్మికుంట, ఇల్లందకుంట నేతలకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని..హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చెందిన ముద్దసాని దామోదర్ రెడ్డి 18 సంవత్సరాలు, కమలాపూర్ మండలం నుంచి ఈటల రాజేందర్ 16 సంవత్సరాలు, హుజురాబాద్ మండలం నుంచి కెప్టెన్ కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా పనిచేశారన్నారు. ఉమ్మడి జమ్మికుంట మండలం నుండి ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇవ్వలేదని..  ఉమ్మడి జమ్మికుంట మండలంలో సుమారు 70 వేల ఓట్లు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి హుజురాబాద్  ఉప ఎన్నికలలో జమ్మికుంట మండలంలోని రెడ్డి సామాజిక వర్గం నుండి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు.