వైశాఖీ వేడుకలో ప్రమాదం.. వంతెన కూలి 40మందికి గాయాలు

వైశాఖీ వేడుకలో ప్రమాదం.. వంతెన కూలి 40మందికి గాయాలు

జమ్మూ కాశ్మీర్‌ ఉధంపూర్‌లోని బైన్ గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. కాలి నడక సాగించే ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారులతో సహా దాదాపు 40మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. వైశాఖీ వేడుకల సందర్భంగా అధిక సంఖ్యలో బ్రిడ్జిపైకి ఒకేసారి రావడంతో లోడ్ ఎక్కువై ప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చెశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన బైన్ గ్రామంలోని బేణి సంగం వద్ద జరిగింది. విషయం తెలుసుకున్న  పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటన జరిగిన సమయంలో కొందరు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వంతెన కూలిపోవడంతో అక్కడ చాలా మంది గుమికూడారు. బ్రిడ్జిపై చిక్కుకుపోయిన వారిని సహాయక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/ANI/status/1646808487828279296