కేసీఆర్​.. నోరు అదుపులో పెట్టుకో.. జన జాతర సభలో మంత్రి పొన్నం

కేసీఆర్​.. నోరు అదుపులో పెట్టుకో.. జన జాతర సభలో మంత్రి పొన్నం

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని   తుక్కుగూడ జన జాతర సభ వేదికనుంచి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.  పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త  కృషి చేయాలని  పొన్నం అన్నారు.  అసెంబ్లీకి రాని కేసీఆర్​ .. జిల్లాల బాట పట్టారని విమర్శించారు.  నోరు అదుపులో పెట్టుకోవాలని కేసీఆర్​ కు సూచించారు.

బీజేపీ.. బీఆర్​ఎస్​ కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు.  ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​ కార్డులు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇవ్వబోతుందన్నారు.  తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.  పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం కోరారు.