హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్యాంపస్ లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని పవన్ సూచించారు.
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కారించాలి - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/uihEgKzRTb
— JanaSena Party (@JanaSenaParty) June 17, 2022