రేపు ఉమ్మడి నల్గొండలో పవన్ కల్యాణ్ పర్యటన

రేపు ఉమ్మడి నల్గొండలో పవన్ కల్యాణ్ పర్యటన

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపురోజున ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం... రేపు ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ నల్గొండకు బయలుదేరుతారు.

మొదట చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామానికి చేరుకొని.... కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కోదాడకి వెళ్తారు. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం అందిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

వస్తున్నా అంటున్న జూ.ఎన్టీఆర్

గుడ్ న్యూస్: తగ్గనున్న వంటనూనెల ధరలు