హైదరాబాద్, వెలుగు : గిరిజనుల అభ్యున్నతిని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్ మన్) పథకాన్ని ప్రారంభించిందని మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్రనాయక్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో 740 గిరిజన తెగలున్నాయని.. అందులో 75 తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపారు. గిరిజనులు, అంతరించే దశలో ఉన్నటువంటి తెగలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.