
జపాన్ ఆటో మేజర్ నిస్సాన్ మాగ్నైట్ ఈజీషిఫ్ట్ కారును రూ.6,49,900 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఇండియా మార్కెట్లో అతి తక్కువ ధరల గల ఏఎంటీ ఎస్యూవీ ఇదేనని తెలిపింది. వచ్చే నెల10 వరకు చేసిన అన్ని బుకింగ్లకు ప్రారంభ ధర వర్తిస్తుంది. ఈజీషిఫ్ట్లోని 1.0- లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 71 బీహెచ్పీని, 96 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు గేర్లు ఉంటాయి. లీటరుకు 19.70 కిలోమీటర్ల మైలేజ్వస్తుందని కంపెనీ చెబుతోంది.