నిస్సాన్​ మాగ్నైట్​ ఈజీషిఫ్ట్​ @ రూ.6.49 లక్షలు

నిస్సాన్​ మాగ్నైట్​ ఈజీషిఫ్ట్​ @ రూ.6.49 లక్షలు

జపాన్​ ఆటో మేజర్​ నిస్సాన్ మాగ్నైట్​ ఈజీషిఫ్ట్ కారును రూ.6,49,900 ఎక్స్-షోరూమ్​ ధరతో లాంచ్​ చేసింది. ఇండియా మార్కెట్లో అతి తక్కువ ధరల గల ఏఎంటీ ఎస్​యూవీ  ఇదేనని   తెలిపింది.  వచ్చే నెల10 వరకు చేసిన అన్ని బుకింగ్‌‌‌‌లకు ప్రారంభ ధర వర్తిస్తుంది. ఈజీషిఫ్ట్​లోని 1.0- లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 71 బీహెచ్​పీని, 96 ఎన్​ఎం గరిష్ట టార్క్ అవుట్‌‌‌‌పుట్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు గేర్లు ఉంటాయి. లీటరుకు 19.70 కిలోమీటర్ల మైలేజ్​వస్తుందని కంపెనీ చెబుతోంది.