క్షేమంగా ఇంటికి చేరిన కిడ్నాపైన బాలుడు

క్షేమంగా ఇంటికి చేరిన కిడ్నాపైన బాలుడు

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం కిడ్నప్ కు గురైన బాలుడు జషిత్ క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. పోలీసుల నిఘా పెరగడం… తప్పించుకోలేమన్న భయంతో బాలుడిని తెల్లవారుజామున రాయవరం మండలం కుతుకులూరులో వదిలి వెళ్లారు కిడ్నాపర్లు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో చిన్నారిని మండపేట పోలీస్ స్టేషన్  కు తీసుకొచ్చిన పోలీసులు.. తల్లిదండ్రులకు పిల్లాన్ని అప్పగించారు. జషిత్  దొరకడంతో తల్లిదండ్రులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు మొత్తం 17 బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలే బాలుడి కిడ్నాప్ కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి నాయనమ్మ పార్వతిపై దాడిచేసిన దుండగులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.