జయం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తోంది?

జయం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తోంది?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ తేజా ఎక్కువగా ప్రేమకథా చిత్రాలనే తీస్తూ ఉంటారు. ఆయన తీసిన సినిమాల్లో ముందుగా గుర్తుకువచ్చేది జయం సినిమా. ఇందులో నితిన్, సదా హీరో హీరోయిన్లుగా నటించగా.. గోపిచంద్ విలన్ పాత్రను పోషించారు. 2002 జూన్ 14న విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్టైంది. మొదటి సినిమాతోనే నితిన్.. సదా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలాగే.. గోపిచంద్ కు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి.  ఇప్పటికీ 20 ఇది రిలీజ్ అయ్యి ఏళ్లు అయినా.. అందులోని పాటలకు, స్టోరీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ సినిమాలో సదా చెల్లి పాత్రలో కనిపించిన అమ్మాయి తన నటనతో ఆకట్టుకుంది. అక్షరాలను తిప్పిరాసే అమ్మాయిగా కనిపించి మెప్పించింది. అంతేకాదు.. ఒక్క సినిమాతోనే ఏకంగా నంది అవార్డ్ గెలుచుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‭గా మెప్పించిన ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తోంది.. ఎలా ఉంది అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. 

జయం సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత.  సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే యామిని శ్వేత. ఈమె కేవలం చిన్నతనంలో మాత్రమే వెండితెరపై కనిపించింది. బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న యామిని.. పెద్దయ్యాక ఇండస్ట్రీకి దూరమైంది. కానీ జయం కంటే ముందే బుల్లితెరపై దాదాపు 10 సీరియల్స్‭లో నటించింది. సీతామహాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం ఆడిషన్స్ కోసం ప్రకటన వచ్చింది. ఆది చూసి ఆమె తండ్రి తన ఫోటోస్ డైరెక్టర్‭కు పంపారు. అలా జయం సినిమాలోకి యామిని ఎంపికైంది. ఆ తర్వాత ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాల్లో నటించింది. ఇక పెద్దయ్యాక యామిని ఇండస్ట్రీకి దూరంగా ఉంది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసిన యామిని ఆ తర్వాత పెళ్లి చేసుకుని గృహిణిగా సెటిలయ్యింది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే.. యామినికి పెద్దయ్యాక చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చదువు పూర్తి చేసేందుకు వాటికి దూరంగా ఉంది.