న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీలో పాల్గొనే నార్త్ జోన్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. కెప్టెన్ మన్దీప్ సింగ్ గాయంతో ఈ టోర్నీకి దూరం కావడంతో అతని ప్లేస్లో హర్యానా ఆల్రౌండర్ జయంత్ యాదవ్ టీమ్ను నడిపించనున్నాడు. ఈ మేరకు జోనల్ కమిటీ కన్వీనర్ అనిరుధ్ చౌదరి గురువారం ప్రకటించాడు. మన్దీప్ ప్లేస్లో పంజాబ్ బ్యాటర్ నేహల్ వదేరాను నార్త్ టీమ్లోకి తీసుకున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన వదేరా బ్యాటింగ్లో దుమ్మురేపాడు. ఈ నెల 28 నుంచి బెంగళూరులో జరిగే క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో నార్త్ జోన్.. నార్త్ ఈస్ట్ జోన్తో తలపడుతుంది.