కర్ణాటక ఎన్నికల ఉత్కంఠ భరితంగా మారాయి. కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమైపోయింది. జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి చన్నపట్న నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, తన ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలుపొందారు. రామ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కుమారుడు నిఖిల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ 68, బీజేపీ 128 స్థానాల్లో, జేడీఎస్ 22 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి.

