జేఈఈ టాపర్స్ వీళ్లే!

జేఈఈ టాపర్స్ వీళ్లే!

ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించిన JEE అడ్వాన్స్ డ్ పరీక్ష ఫలితాలను ఖరగ్ పూర్ ఐఐటీ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన మ్రిదుల్ అగర్వాల్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మొత్తం 360 మార్కులకు గాన అతనికి 348 మార్కులు వచ్చాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలతో పాటు 114 విద్యా సంస్థల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. మొత్తం 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 20 వేల మంది విద్యార్థులు JEE అడ్వాన్స్ డ్ పరీక్ష రాశారు. రేపట్నుంచి ప్రవేశాల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 25 వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. 27న సీట్ల కేటాయింపు జరగనుంది.