జేఈఈ మెయిన్​లో ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభంజనం

జేఈఈ మెయిన్​లో ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభంజనం

హనుమకొండ, వెలుగు:  నేషనల్​ టెస్టింగ్​ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ  మెయిన్స్ 2024 సెషన్ వన్​ ఫలితాల్లో ఎస్ఆర్​ విద్యా సంస్థల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ఎస్ఆర్ ​విద్యా సంస్థలకు చెందిన దొంతుల మనీశ్​ 300 మార్కులకుగానూ 295 మార్కులతో  జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. తుమ్మ తేజస్వీ  99.95శాతం, ఆర్.దీపాన్ష్​ రెడ్డి 99.91శాతం, పి.నిహాల్​ శ్రీవాత్సవ్​ 99.91 శాతం మార్కులు సాధించారు.

కే.శ్రీరామ్​ రెడ్డి, కే.సిద్ధార్థ రెడ్డి, వడ్లూరి ప్రతీక్​, వి.సాయి ప్రణతి, ఉప్పల సూర్యతేజ, కేడీ.చెన్న కేశవ రెడ్డి, ఎం.శ్రీవళ్లి, మంచాల చంద్రదీప్​, కె.సుబ్రహ్మణ్య ఆకాశ్​, వల్లూరి వైశాలి 99 శాతానికిపైగా మార్కులు సాధించారు. తమ విద్యా సంస్థల పేరును విద్యార్థులు జాతీయ స్థాయిలో నిలబెట్టారని ఎస్ఆర్​ విద్యాసంస్థల చైర్మన్​ వరదారెడ్డి, డైరెక్టర్లు మధూకర్​ రెడ్డి, సంతోష్​ రెడ్డి తెలిపారు.