
జీడిమెట్ల, వెలుగు: భర్త తనకు సమయం ఇవ్వడం లేదని భార్య ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కి చెందిన సునీల్పాండే బతుకు దెరువుకోసం వచ్చి సూరారం రాజీవ్ గాంధీనగర్లో నివాసముంటున్నారు. ఇతనికి భార్య సుధాపాండే (29), ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి. భర్త బయటకు వెళ్లిన ప్రతిసారి ఎక్కడ ఉన్నావని తనతో సమయం గడపడం లేదని తరచూ గొడవపడేది.
ఈ క్రమంలో సోమవారం సునీల్పాండే అద్దెకుంటున్న ఇంటి గేటు విరిగిపోవడంతో బాగు చేయించడానికి ఇంటి ఓనర్తో కలిసి బయటకు వెళ్లాడు. మధ్యాహ్12 గంటలకు సునీల్పాండే భార్య సుధాపాండే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని తమతో టైం గడపవని ఫోన్లో గొడవపడింది. అనంతరం అతడు ఇంటికి వెళ్లి చూసే సరికి ఫ్యాన్కి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యతో గొడవపడి భర్త సూసైడ్
జీడిమెట్ల: భార్యతో గొడవపడి భర్త సూసైడ్ చేసుకున్నాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఖమ్మం జిల్లాకు చెందిన నర్సింగరావు (45) బతుకు దెరువు కోసం వచ్చి జగద్గిరిగుట్ట సుమిత్రనగర్లో నివాసముంటూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు.
కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవపడేవాడు. ఆదివారం భార్యతో గొడవపడి పక్కనే ఉన్న హనుమాన్నగర్లో ఉండే తన తమ్ముడు సంతోష్ ఇంటికి వెళ్లాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.