పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని సీతారాం ఏచూరికి జేరిపోతుల పరశురామ్ వినతి

పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని సీతారాం ఏచూరికి జేరిపోతుల పరశురామ్ వినతి

న్యూఢిల్లీ, వెలుగు:  కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించేలా పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సహకరించాలని సీపీఎం నేషనల్ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరిని కోరారు. ఆదివారం ఢిల్లీలోని మార్క్స్ భవన్ లో ఏచూరిని కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై సీతారాం ఏచూరి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే, కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ నెల 21న జంతర్ మంతర్ లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.