ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..డాక్టర్ దంపతులు మృతి

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..డాక్టర్ దంపతులు మృతి

జార్ఖండ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ధన్ బాద్ లోని ఓ హాస్పిటల్  కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో  ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ దంపతులతో పాటు వారి బంధువు, మరో ఇద్దరు  సిబ్బంది ఉన్నారని ధన్ బాద్ డీఎస్పీ అరవింద్ కుమార్ చెప్పారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.