‘గద్దలకొండ గణేష్’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘జిగర్ తండ2’

‘గద్దలకొండ గణేష్’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘జిగర్ తండ2’

సిద్థార్థ్​, బాబీ సింహా లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన ‘జిగర్ తండ’ చిత్రం ఎనిమిదేళ్ల  క్రితం తమిళనాట సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా తెరకెక్కించారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘జిగర్ తండ2’ని ప్లాన్ చేశాడు కార్తీక్ సుబ్బరాజు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య మెయిన్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నట్టు సోమవారం అనౌన్స్ చేశారు. 

కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు. ఫస్ట్ పార్ట్ తరహాలోనే ‘జిగ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌తండ 2’ కూడా యాక్షన్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ జానర్‌‌‌‌‌‌‌‌లోనే తెర‌‌‌‌‌‌‌‌కెక్కనుందని,  ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.  సంతోష్ నారాయ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌న్ సంగీతం అందిస్తున్నాడు.