ఒకే ఏరియాలో ఐదు ఇండ్లను కొనేశాడు..

ఒకే ఏరియాలో ఐదు ఇండ్లను కొనేశాడు..

న్యూయార్క్​: మిస్టర్‌‌‌‌‌‌‌‌ బీస్ట్​గా పాపులర్​ అయిన ఫేమస్​ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌‌‌‌‌‌‌‌సన్ మామూలోడు కాడు.  అమెరికా నార్త్ కరోలినాలోని ఒక ఏరియాలో ఐదు ఇండ్లను కొనిపారేశాడు.  తనకు, తన కుటుంబానికి,  తన ఉద్యోగుల కోసం వీటిని కొన్నాడు. న్యూయార్క్ పోస్ట్ ద్వారా ఈ సంగతి తెలిసింది. మిస్టర్ బీస్ట్ 25 ఏళ్ల మిలియనీర్. యూట్యూబ్​లో మనోడికి చాలా ఫాలోయింగ్​ ఉంది. ఒక్కో వీడియోను దాదాపు కోటి మంది దాకా చూస్తారట. స్టంట్ వీడియోలు,  భారీ-బడ్జెట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ వీడియోలు చాలా పాపులర్​ అయ్యాయి.

బీస్ట్​ జనానికి  డబ్బులు ఉచితంగానూ ఇవ్వడంతో పాపులారిటీ మరింత పెరిగింది. ప్రపంచంలో అత్యధికంగా సబ్​స్క్రిప్షన్లు సాధించిన యూట్యూబర్‌‌‌‌‌‌‌‌లలో బీస్ట్​ నాలుగో స్థానంలో ఉన్నాడు. నార్త్ కరోలినాలోని గ్రీన్‌‌‌‌‌‌‌‌విల్లే సమీపంలోని కల్-డి-సాక్‌‌‌‌‌‌‌‌లో ఐదు ఇళ్లను కొన్నాడు.  తన మొదటి ఇంటిని 2018లో  3,20,000 డాలర్లకు దక్కించుకున్నాడు. ఆ తరువాత పొరుగున ఉన్న ఇతర ఇళ్లను కొన్నాడు.